ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు. ఇటీవల ఆయన ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ పదవికి రాజీనామా చేశారు. విద్యుత్ శాఖపై సమీక్షకు పూర్తి వివరాలతో సిద్ధం కావాలని సీఎం రేవంత్రెడ్డి నిన్న(గురువారం) అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభాకర్రావు రాజీనామాను ఆమోదించవద్దని.. సమీక్ష సమావేశానికి ఆయనను కూడా పిలవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్రావు స్పందిస్తూ సీఎంవో నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. అంతేకాదు..ముఖ్యమంత్రి పిలిస్తే ఎందుకు వెళ్లను? నన్ను పిలిస్తే కచ్చితంగా సమావేశానికి హాజరవుతా అని తెలిపారు ప్రభాకర్రావు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రేవంత్ రెడ్డి ట్వీట్