బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం అర్ధరాత్రి కాలు జారి కిందపడటంతో ఆయన కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్కు తరలించారు. పరిశీలించిన వైద్యులు కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా, శుక్రవారం సాయంత్రం కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయనున్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ బాత్రూంలో పడిపోవడంతో.. ఆయన కాలికి తీవ్ర గాయమైందన్నారు. హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపుతున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.