Monday, May 6, 2024

కేసీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని.. ప్రజలకు సేవ చేయాలి

spot_img

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. బీఆర్‌ఎస్‌ అధినేత సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. గురువారం అర్థరాత్రి ఆయన కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

‘బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కి గాయమైందని తెలిసి బాధపడ్డాను. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎన్నో సవాళ్లను అధిగమించిన కేసీఆర్‌.. ఈ అనారోగ్య పరిస్థితుల్ని కూడా మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం ఉంది. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని ప్రజలకు, సమాజానికి తన సేవలు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నా’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Latest News

More Articles