Monday, May 20, 2024

రేవంత్ రెడ్డి..నీ భాష మార్చుకో

spot_img

బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పట్ల విశ్వాసంతో ఉన్నారని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మేనిఫెస్టోలో లేనివి కూడా బీఆర్ఎస్ నెరవేర్చిందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ కేవలం 22 అసెంబ్లీ టిక్కెట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడటం దారుణమన్నారు మంత్రి తలసాని. ప్రజాప్రతినిధులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారన్నారు. ప్రజలు అతని భాషను గమనించాలని కోరారు. రేవంత్ రెడ్డి ఒక్కడికే ఆ భాష వస్తుందా? అని అన్నారు. తమకు టిక్కెట్లు దక్కలేదని కాంగ్రెస్ బీసీ నేతలు ఢిల్లీలో ధర్నా చేసిన విషయం కూడా చూశామన్నారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ కు ముందు.. తర్వాత జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయ్యాలి

Latest News

More Articles