Friday, May 10, 2024

కర్ణాటక కాంగ్రెస్ నేతలు తెలంగాణకి వచ్చి హామీలు ఇవ్వడం ఆశ్చర్యం

spot_img

నల్గొండ : రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాతనంగా ఉండాలి. విచక్షణ లేకుండా అమర్యాదగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉద్దేశించి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషను ఖండిస్తున్నట్లు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Also Read.. జనసేనకు భారీ షాక్.. బీఆర్ఎస్ పార్టీలో చేరిన లీడర్లు

‘‘బిసి డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ ప్రకటనలతో కాంగ్రెస్ పార్టీ మోస పూరిత హామీలను ఇస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు. కర్ణాటక కాంగ్రెస్ నేతలు తెలంగాణకి వచ్చి హామీలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. దేశంలో ఎక్కువ అవినీతి చేసే రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. అక్కడ పారిశ్రామిక వేత్తలు, బిల్డర్స్ కమిషన్ ఇవ్వలేక బాధపడుతున్నారు.

Also Read.. ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్ర బాబు మృతి

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఆరు గ్యారెంటీ స్కీమ్స్ అమలు చేయడం లేదు. పది సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి చెప్పుకుంటూ బిఆర్ఎస్ పార్టీ ఓట్లు అడుగుతుంటే, ఒక్క కేసీఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు ఓట్లు అడగడానికి వస్తున్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్ ది. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందింది.

Also Read.. కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా? రైతులు ఆలోచించుకోవాలి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాల్లో 12 సీట్లు బిఆరెస్ పార్టీనే గెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్ని సార్లు ఓడిపోయిన బుద్దిరాలేదు. ఆయన స్థాయిని మరిచి గజ్వేల్ పోటీ చేస్తా, నల్గొండలో ఒక్క బీఆరెఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీలో అడుగుపెట్టనియం అని మాట్లాడుతున్నాడు.  నల్గొండలో బిఆర్ఎస్ పార్టీ గెలిచే మొదటి స్థానం మునుగోడు నే. రాజగోపాల్ రెడ్డి ఆయన పరిస్థితి ఏందో చూసుకొంటే మంచిది. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన మళ్ళీ కేసీఆర్  నే ముఖ్యమంత్రి అవుతారు. బిఆరెస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం.’’ అని ఆయన తెలిపారు.

Latest News

More Articles