Friday, May 17, 2024

జనసేనకు భారీ షాక్.. బీఆర్ఎస్ పార్టీలో చేరిన లీడర్లు

spot_img

వరంగల్ : తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని 8 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీకి షాక్ తగిలింది.  వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో జనసేన తూర్పు ఇన్‌చార్జి తాళ్లపెల్లి బాలుగౌడ్‌, వరంగల్‌ 42వ డివిజన్‌ స్వతంత్ర కార్పొరేటర్‌ గుండు చందన పూర్ణచందర్‌, ఉద్యమ నాయకుడు అచ్చ విద్యాసాగర్‌తో పాటు మరికొందరు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Also Read.. మద్యం లారీ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం

Latest News

More Articles