Sunday, May 19, 2024

మద్యం లారీ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం

spot_img

విశాఖపట్నం జిల్లా మధురవాడ కొమ్మది దగ్గర మద్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న లిక్కర్ బాక్సులు మొత్తం రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. లారీ అలా బోల్తా కొట్టిందో లేదో అదే సమయంలో అక్కడ ఉన్న ప్రజలు..లిక్కర్ బాటిళ్లను తీసుకునుందుకు పోటీ పడ్డారు. వాటిని దక్కించుకునేందుకు పోటీపడ్డారు.

రోడ్డుపై పడిన మద్యం బాటిళ్లను అందిన కాడికి ఎత్తుకెళ్లారు. స్థానికులతో పాటు అటువైపుగా వస్తున్న వాహనదారులు కూడా పోటీ పడి మరీ బాటిళ్లకు బాటిళ్లు పట్టుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే రోడ్డుపై  పగిలిపోయిన బాటిల్స్ తప్ప ఏమీ కనిపించలేదు. పోలీసులు ప్రజలను అడ్డుకుని పరిస్థితిని అదుపు చేశారు.

ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌లో మరోసారి SIA సోదాలు

Latest News

More Articles