ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఇవాళ(శనివారం) జరిగిన ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మ్యాచ్లో.. ఆసీస్ జట్టు విజయం సాధించింది. మహారాష్ట్రలోని పుణే వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది.307 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్..45 ఓవర్లలోనే చేధించి.. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్ష్ 177 (నాటౌట్) పరుగులతో చెలరేగాడు. స్టీవ్ స్మిత్ 63 (నాటౌట్) పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. వార్నర్ 53 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి రెండో వికెట్ గా అవుటయ్యాడు.
ఇప్పటికే ఆస్ట్రేలియా సైమీ ఫైనల్ చేరుకోగా… బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ తర్వాత వరల్డ్ కప్ నుంచి తప్పుకోనుంది.
ఇది కూడా చదవండి: గిరిజనులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్