Friday, May 17, 2024

లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలి.. ముఖ్యమంత్రి కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు

spot_img

హైదరాబాద్: దీపావళి పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి  హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యమున్నదని  సీఎం అన్నారు.

Also Read.. బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం

జీవానికి సంకేతమైన  అగ్ని  కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి  నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా ప్రేరణనిస్తాయని సీఎం తెలిపారు. మనలో అంతర్జ్యోతి వెలిగినప్పుడే జీవితం పట్ల స్పష్టత ఏర్పడి ప్రతి రోజు పండుగలా ఆవిష్కృతమవుతుందని సీఎం అన్నారు. మనం పయినించే ప్రగతి పథంలో అడుగడుగనా అడ్డుపడే నరకాసురుల” నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు.

Also Read.. కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా? రైతులు ఆలోచించుకోవాలి

ప్రజల సంక్షేమాన్ని కోరి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటాకులు కాలుస్తూ దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.  లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజల పై ఉండాలనీ, ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

Latest News

More Articles