Saturday, May 4, 2024

గిరిజనులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్

spot_img

తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంది గిరిజన బిడ్డలు ప్రజాప్రతినిధులుగా ఉన్నామంటూ అది సీఎం కేసీఆర్ బిక్షనేనని అన్నారు మంత్ర సత్యవతి రాథోడ్. తండాలు, గ్రామ పంచాయతీలు కావడంతో ఇవాళ ఇంత మందికి సర్పంచ్ లుగా అవకాశం వచ్చిందన్నారు. మేడ్చల్ జిల్లాల్లోని షామీర్ పేట్ లో జరిగిన గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు మంత్రి సత్యవతి.

కేసీఆర్ ఆశీర్వాదంతో ఇవాళ సర్పంచ్ లుగా ఈ సభకు వచ్చాము.ఇవాళ రాష్ట్రంలో అనేక గిరిజన గురుకుల పాఠశాలలు వచ్చాయి. గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు కట్టించారు.గిరిజనులకు 10 రిజర్వేషన్లు కావాలి అంటే మన సీఎం కేసీఆర్ రిజర్వేషన్లు కల్పించారు. దానికి మంత్రులు హరీష్ రావు, కేటిఆర్ కృషి ఎంతో ఉంది. 4.5 లక్షల ఎకరాల పోడు భూములకు ఒక్కసారి పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. 11 సార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉంది.. కాని ఎన్నడూ కూడా తండాలను గ్రామ పంచాయతీలు చేయలేదన్నారు. మనను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.

మనను జాగృతం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ…అని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. మనం అడిగింది ఇచ్చిన నాయకుడు కేసీఆర్. మన నాయకుడు మరో 10 ఏండ్లు అధికారంలో ఉంటే మనకు మరింత లాభం జరుగుతుంది. లంబాడిలకు శేరు సారా పోస్తే ఓట్లు వేస్తారు అని మనలను అవహేళన చేసి మాట్లాడిన వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 4000 కోట్లతో ప్రతి తండాకు రోడ్లు వేసుకున్నామని తెలిపారు మంత్రి సత్యవతి. కొమురం భీం, సేవాలాల్ జయంతి వర్ధంతిని అధికారికంగా జరిపిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మేడారం జాతరను జాతీయ పండుగ గా గుర్తించలేదని,గిరిజన యూనివర్సిటీని ఆలస్యం చేసిందన్నారు. మనమందరం మరొక్క సారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు మంత్రి సత్యవతి రాథోడ్.

ఇది కూడా చదవండి: కార్తీకమాసంలో శైవ క్షేత్రాలకు టీఎస్‌ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు

Latest News

More Articles