Saturday, May 18, 2024

కార్తీకమాసంలో శైవ క్షేత్రాలకు టీఎస్‌ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు

spot_img

పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ  స్పెషల్‌ బస్సులను  నడుపుతోంది. పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. వేములవాడ, కాళేశ్వరం, రామప్పగుడి, వెయ్యి స్తంభాల గుడి, పాలకుర్తి తదితర శివాలయాలకు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రతి ఆదివారం, కార్తిక పౌర్ణమి ముందురోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలు దేరుతాయని చెప్పారు. మళ్లీ దర్శనం తర్వాత సోమవారం రాత్రికి రాజధానికి చేరుకుంటాయని తెలిపారు.

అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పంచారామ క్షేత్రాలకు బస్సులు నడుపనున్నారు. ఈ బస్సులు కూడా ప్రతి ఆదివారం, పౌర్ణమి ముందు రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరనున్నాయి. తిరిగి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటాయి.

ఇది కూడా చదవండి: పనిచేసే ప్రభుత్వాన్నే ప్రజలు ఆశీర్వదిస్తారు

Latest News

More Articles