హైదరాబాద్: ఎన్నికల్లో పంచేందుకు తరలిస్తున్న నగదును అధికారులు పట్టుకున్నారు. భారీగా డబ్బుసంచులను స్వాధీనం చేసుకున్నారు. అప్పా జంక్షన్ వద్ద పోలీసులు వీటిని పట్టుకున్నారు. 6 కార్లల్లో తరలిస్తున్న 7.40కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. ఎన్నికల కోసం డబ్బులు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి సంబంధించిన నగదుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read.. బీజేపీ, కాంగ్రెస్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ పెద్దలు రావాల్సిందే