Saturday, May 4, 2024

బీజేపీ, కాంగ్రెస్‌లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ పెద్దలు రావాల్సిందే

spot_img

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ ధర రూ.400కే అందజేస్తామని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఏ నిర్ణయం తీసుకున్నా ఢిల్లీ పెద్దలు రావాల్సిందేనని.. కానీ బీఆర్ఎస్ ఇక్కడి పార్టీయే అన్నారు. మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కటి కాదు… 11 అవకాశాలు ఇచ్చినా చేసిందేమీ లేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు. ఆసరా పెన్షన్లు, రైతుబంధు వంటి పథకాలు రాష్ట్రంలో తప్పా.. మరెక్కడా అమలు కావడం లేదన్నారు. 2014కు ముందు ఉన్న… ప్రస్తుతం ఉన్న మానుకోటను ఒక్కసారి  అంచనా వేసుకోవాలన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

సీఎం కేసీఆర్ పాలనలో మానుకోటను జిల్లాను చేసుకున్నామని, అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు మంత్రి సత్యవతి రాథోడ్. కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడైనా రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాల గురించి పథకాలు అమలు చేయాలనే ఆలోచన వారికి వచ్చిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే వాళ్లం కాదని, ఇప్పుడు అక్కడే ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. మానుకోటలో 100 పడకల ఆసుపత్రిని 365 పడకల ఆసుపత్రి చేసుకున్నామన్నారు. మహబూబాబాద్‌కు కేసీఆర్ రూ.50కోట్ల ప్రత్యేక నిధులను కేటాయించారన్నారు. ఈ పనులు పూర్తయితే మానుకోట రూపురేఖలు మారిపోతాయన్నారు. బీజేపీ 10 ఏండ్ల పాలనలో సిలిండర్‌ ధరలు మూడింతలు పెరిగిందని విమర్శించారు మంత్రి.

మానుకోట అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ 24 గంటలు అందుబాటులో ఉండే శంకర్‌ నాయక్‌ను మరోసారి గెలిపించాలని కోరారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కరువు లేదు.. కర్ఫ్యూ లేదు

Latest News

More Articles