Saturday, May 18, 2024

లోయలో పడ్డ కారు..ఐదుగురు విద్యార్థులు దుర్మరణం.!

spot_img

ఉత్తరాఖండ్ ముస్సోరీలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కాలేజీ విద్యార్థులు మరణించారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కారు లోయలో పడిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చపట్టారు. మరణించినవారిలో నలుగురు యువకులు, ఓ యువతి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో యువతికి తీవ్రగాయాలయ్యాయని ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా డెహ్రాడూన్ ఐఎంఎస్ కళాశాలకు చెందినవారిగా పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ..బాధకరమన్నారు. మరణించినవారి ఆత్మకు శాంతి కలగాలని ఈ బాధను తట్టుకునే శక్తి వారి కుటుంబాలకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: పొలంలో ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్..సాంకేతికలోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!

Latest News

More Articles