Saturday, May 18, 2024

లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేసిన తొలి థర్డ్‌ జెండర్‌ 

spot_img

ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరికైనా హక్కు ఉంది. ఇందులో భాగంగానే మొట్టమొదటి సారిగా లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేశాడు తొలి థర్డ్‌ జెండర్‌ వ్యక్తి. ఢిల్లీలోని సంగమ్ విహార్ కు చెందిన 26 ఏళ్ల రాజన్ సింగ్ దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి  నిన్న(శుక్రవారం) నామినేషన్ వేశాడు. ధోతీ, టోపీ, నగలు ధరించిన అతడు ఒంటరిగా వచ్చి సాకేత్‌లోని దక్షిణ ఢిల్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పేపర్లు సమర్పించాడు. చేతిలో లక్ష నగదు, 200 గ్రాముల బంగారం, బ్యాంకు ఖాతాలో రూ.10,000కుపైగా డబ్బు కలిపి సుమారు రూ.15.10 లక్షల చరాస్తులున్నట్లు అఫిడవిట్‌లో ప్రకటించాడు. అయితే ఎలాంటి స్థిరాస్తులు లేవని తెలిపాడు.

బీహార్‌ నుంచి 2010లో వలస వచ్చి ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు రాజన్ సింగ్ తెలిపాడు. థర్డ్ జెండర్ వ్యక్తులకు ప్రత్యేక సౌకర్యాలు లేకపోవడం, సామాజిక అంగీకారం, హక్కుల కోసం వారు పడుతున్న సమస్యలపై ప్రజలతో పాటు అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పాడు. తనకు థర్డ్ జెండర్‌గా సర్టిఫికెట్ పొందేందుకు మూడేళ్లకుపైగా పట్టిందన్నాడు.

థర్డ్ జెండర్ వ్యక్తుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర ప్రత్యేక వాష్‌రూం లు, క్యూలైన్లు వంటి ప్రాథమిక అవసరాలను ప్రభుత్వం కల్పించాలని రాజన్‌ సింగ్‌ కోరాడు. విద్యా, ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు జాతీయ ట్రాన్స్ జెండర్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్‌ చేశాడు. ఎన్నికల్లో తాను గెలిస్తే థర్డ్‌ జండర్‌ వ్యక్తులకు సంబంధించిన ప్రాథమిక అవసరాలు తీరుస్తానని, వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు రాజన్‌ సింగ్‌.

ఇది కూడా చదవండి: రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నరు

Latest News

More Articles