Sunday, May 19, 2024

సేవ్ కాంగ్రెస్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్

spot_img

అదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డికి అసమ్మతి సెగ తగిలింది.  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కంది శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల రహస్య సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తి నుండి కాపాడాలని డిమాండ్ చేస్తూ  సేవ్ కాంగ్రెస్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ పేరిట రత్నా గార్డెన్ లో కాంగ్రెస్ నేతల ప్రత్యేక సమావేశం జరిపారు.

Also Read.. ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నంలో రాజకీయ కుట్ర.. సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిత్ ఖాన్, ఏఐసిసి సభ్యురాలు  సుజాత, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, జిల్లా వ్యాప్తంగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టును పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్మితే, కంది శ్రీనివాస్ టికెట్ ను కొన్నాడని బహిరంగంగా ఆరోపించారు. కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారు హెచ్చరించారు.

Latest News

More Articles