బాన్సువాడ: తాను ఏది అడిగినా సీఎం కేసీఆర్ కాదనకుండా నిధులు ఇచ్చారని పోచారం శ్రీనివాస్రెడ్డి చెప్పారు. బాన్సువాడలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ప్రజలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రశంసలు కురిపించారు. బాన్సువాడ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ అడిగినన్ని నిధులు ఇచ్చారని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గం నిండుకుండలా కనిపిస్తోందన్నారు.
Also Read.. జుక్కల్ ను మరింత అభివృద్ది చేసే బాధ్యత నాది
బాన్సువాడ నియోజకవర్గంలో సాగునీటి రంగానికే రూ.వెయ్యి కోట్లు ఇచ్చారని తెలిపారు. మిషన్ కాకతీయకు రూ.100 కోట్లు ఇచ్చారన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో నీటి కొరత లేదు. ప్రజలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్. బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాం. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ ఇన్ని రెండు పడక గదుల ఇళ్లు నిర్మించలేదని పోచారం శ్రీనివాస్రెడ్డి చెప్పుకొచ్చారు.