కర్ణాటక రాజధాని బెంగళూరులోని వీరభద్ర నగర్లోని బస్ డిపోలో ఇవాళ(సోమవారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో దాదాపు 10 బస్సులు దగ్ధమయ్యాయి. డిపోలో 50 బస్సులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. మంటలను అదుపు చేసేందుకు అనేక అగ్నిమాపక దళ వాహనాలు అక్కడకు చేరుకున్నారు. ఎగిసిపడుతున్న అగ్నికీలలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు అగ్నిమాపక అధికారి
బస్సులకు మంటలు అంటుకోవడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కటింగ్, వెల్డింగ్ మిషన్ నుంచి నిప్పురవ్వ రావడంతో మంటలు వ్యాపించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:జుక్కల్ ను మరింత అభివృద్ది చేసే బాధ్యత నాది