కేరళ : మళయాళ నటి రెంజూష మీనన్ (35) సోమవారం ఉదయం తిరునంతపురంలోని తన ఫ్లాట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read.. ఘోర ప్రమాదం..స్కూల్ వ్యాన్ను ఢీకొన్న బస్సు…ముగ్గురు చిన్నారులు మృతి..!!
కొచ్చికి చెందిన రెంజూష మీనన్ ఆరంభంలో టీవీ షో యాంకర్గా కెరీర్ను ప్రారంభించింది. ఆపై టీవీ సీరియల్స్ ద్వారా బుల్లితెరపై మెరిసింది. సిటీ ఆఫ్ గాడ్, బాంబే మిర్చ్, కార్యస్ధాన్, వన్ వే టికెట్ వంటి పలు టీవీ షోల ద్వారా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో ఆమె సపోర్టింగ్ రోల్స్తో అశేష ప్రేక్షకాభిమానం సొంతం చేసుకుంది.