Sunday, May 19, 2024

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. దూరమైన మరో కీలక నేత

spot_img

హైదరాబాద్: రేవంత్ రెడ్డి చర్యతో కాంగ్రెస్ పార్టీ బ్రష్టు పట్టిపోతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమరయ్య మండిపడ్డారు. తెలుగుదేశం నుంచి వచ్చిన నేతలు నిజమైన కాంగ్రెస్ నేతలను పార్టీకి దూరం చేస్తున్నారని అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొమరయ్య పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Also Read.. రాహుల్ గాంధీకి ఏం తెలుసు.. ధరణిని తీసేస్తామని మాట్లాడుతుండు

తల్లి లాంటి పార్టీని వీడుతున్నందుకు తీవ్ర ఆవేదన కలుగుతుందంటూ కన్నీరు పెట్టుకున్నారు. 44 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన తన పట్ల రేవంత్ వ్యవహరించిన తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. తన జీవితంలోనే ఇలాంటి పిసిసి అధ్యక్షుని చూడలేదంటూ వాపోయారు. బూటకపు సర్వేలతో తెలుగుదేశం నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చిన నేతలు నిజమైన కాంగ్రెస్ వాదులను పార్టీ వాదులను నెట్టివేస్తున్నారని అన్నారు‌. త్వరలోనే భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తారని చెప్పారు.

Latest News

More Articles