Friday, May 17, 2024

బీఆర్‌ఎస్‌ గెలుపుని ఆపడం ఎవని తాత, జేజమ్మ వశం కాదు

spot_img

సత్తుపల్లి, ఇల్లందు: బీఆర్‌ఎస్‌ గెలుపుని ఆపడం ఎవని తాత, జేజమ్మ వశం కాదని.. ఆరు నూరైనా తెలంగాణలో గెలువబోయేది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని సీఎం కేసీఆర్‌ తెగేసి చెప్పారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలువకుండా ఎవడూ ఆపలేడన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా సత్తుపల్లి, ఇల్లందు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.

Also Read.. ద‌ళిత‌బంధు కోసం ఈ మొగోళ్లు ధ‌ర్నా చేశారా? ప్ర‌తిప‌క్షాల‌పై సీఎం కేసీఆర్ ఫైర్

‘‘ఖమ్మం జిల్లాలో ఒకరిద్దరు బలిచినోళ్లున్నారు. బీఆర్‌ఎస్‌ తరఫున నిలబడ్డ ఎవన్ని కూడా అసెంబ్లీ వాకిలి తొక్కనియ్యనని అంటున్నరు. అది అయ్యేపనేనా..? ఓటర్లు తలుచుకుంటే సత్తుపల్లి నియోజకవర్గంలో దుమ్మురేగదా..? సండ్ర వెంకట వీరయ్య నాలుగోసారి శాసనసభలో అడుగుపెట్టడా..? నామా నాగేశ్వర్‌రావు ఖమ్మం పహిల్వాన్‌లా లోక్‌సభలో అడుగుపెట్టడా..? నాలుగు పైసలు జేబులో పడితే ఇంత అహంకారం పెరుగుతదా? పదేళ్లు సీఎంగా పని చేసిన నేను కూడా అంత అహంకారంతోటి మాట్లాడలేదు.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

Latest News

More Articles