Tuesday, May 7, 2024

 మెదక్ ఎంపిపై కత్తితో దాడి.. కీలక విషయాలు చెప్పిన సిద్దిపేట పోలీస్ కమిషనర్

spot_img

సిద్దిపేట జిల్లా: మెదక్ ఎంపి, దుబ్బాక నియోజవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ శ్వేత మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ నెల 30రోజున సూరంపల్లిలో కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తి తో దాడి జరిగిందని, ప్రజల ఆగ్రహంతో ఎంపీపై కత్తితో దాడి చేసిన వ్యక్తి పై దాడి చేశారని, అతడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు.

Also Read.. కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. దూరమైన మరో కీలక నేత

ఈ కేసులో అన్నీ ఆధారాలు సేకరించాము. దాడి చేసిన వ్యక్తి పలు న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం నిందితుడు ప్రణాళిక ప్రకారం కత్తిని కొనుగోలు చేశాడు. నిందుతుడిని బుధవారం కోర్టు ముందు హాజరు పరచగా జడ్జి 14రోజుల రిమాండ్ విధించారని తెలిపారు. నిందుతునికి ఎవరైనా సహకారం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు.

Also Read.. హార్ట్ ఎటాక్‎తో యాక్టర్ ప్రియ మృతి

ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్ట్ లు పెట్టవద్దని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతానికి నిందుతుడు రాజు ఎవరి సహకారం తీసుకోలేదని, అతడు ఒక్కడు మాత్రమే నేరంలో పాల్గొన్నట్లు తెలిపారు. నిందుతుడు సెన్సేషన్ క్రియేట్ చేయడానికే దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీపీ చెప్పారు.

Latest News

More Articles