Sunday, May 19, 2024

దేశ వ్యాప్తంగా తగ్గిన కరోనా కేసులు

spot_img

కొద్ది రోజుల వరకు భారీగా పెరిగిన కరోనా కేసులు..పస్తుతం తగ్గాయి. నిన్న(ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి ఇవాళ (సోమవారం) ఉదయం 8 గంటల వరకు 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 4,282 కేసులు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,43,70,878 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,547కి చేరింది.

ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.11 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

Latest News

More Articles