హైదరాబాద్ కూకట్ పల్లిలోని కన్యకాపరమేశ్వరి సహకార బ్యాంకును మోసం చేసిన కేసులో బార్యాభర్తలను అరెస్టు చేశారు సీఐడీ అధికారులు. 14ఏళ్లుగా తప్పించుకున్న తిరుగుతున్నారు ఆ బ్యాంకు డైరక్టర్ పద్మ, ఆమె భర్త. ఇవాళ (సోమవారం) ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సీఐడీ అధికారులు.
కూకట్ పల్లిలోని కన్యకాపరమేశ్వరి సహకార బ్యాంకులో 2009లో అవకతవకలకు పాల్పడ్డారు. బినామీ పేర్లతో రుణాలు తీసుకున్నారు బ్యాంకు డైరక్టర్లు, ఉద్యోగులు. 2.86కోట్ల రుణాలు తీసుకొని సొంత ఖాతాలకు మళ్లించుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశారు. కన్యకాపరమేశ్వరి సహకార బ్యాంకు డైరెక్టర్ పద్మ, ఆమె భర్త బ్యాంకు ఉద్యోగిపై 2016లో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు సీఐడీ అధికారులు.