Saturday, May 4, 2024

దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అమిత్ షా వ్యాఖ్యలు.. మంత్రి హరీష్ ఫైర్

spot_img

బీజేపీపై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని అన్నారు. బ్యాట్ కూడా సరిగ్గా పట్టని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తె లుసని.. పరోక్షంగా హోంమంత్రి అమిత్ షాను విమర్శించారు.

కుటుంబ పాలన గురించి అమిత్ షా మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 2జీ, 3జీ, 4జీ కాదు కేంద్రంలో నాజీలను మించిన నియంతృత్వ పాలన సాగుతుందన్నారు. తెలంగాణలో అధికారం సంగతి తర్వాతని.. ముందు సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించాలన్నారు.

తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజీలేని యోధుడు కేసీఆర్ అన్నారు. అబద్ధపు విమర్శలు, ఔట్ డేటెడ్ ఆరోపణలు రాసిచ్చి స్క్రిప్టులతో హోంమంత్రి అసత్యాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్ కొమ్ముకాసే చట్టాలను ఉపసంహరించుకుని తోక ముడిచిన మీరా రైతు బాంధువుడైన కేసీఆర్ ను విమర్శించేది అన్నారు.

Latest News

More Articles