Sunday, May 19, 2024

తమ్మినేని సేఫ్..!

spot_img

తీవ్ర అనారోగ్యంతో మంగళవారం ఏఐజీ ఆసుపత్రుల్లో చేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు ప్రకటించారు వైద్యులు. కొద్దిపాటి మందులతో రక్తపోటును అదుపులో ఉంచుకుని స్థిరంగా కొనసాగుతున్నారని.. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

అయితే రాబోయే 24 నుంచి 48 గంటలు కీలకమని వైద్యులు తెలిపారు. క్రాస్ ఫంక్షనల్ వైద్యుల బృందం తమ్మినేనిని పర్యవేక్షిస్తూనే ఉంటారని.. ఆయనకీ నిరంతర వెంటిలేషన్ అవసరమని చెప్పారు. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్ కి చేరుకుంటున్నాయని తెలిపారు. లంగ్స్‌లో నీరుని తొలగిస్తున్నామన్నారు. మెడిసిన్స్‌కి తమ్మినేని స్పందింస్తున్నారు. 50 శాతానికి పైగా స్వయంగా శ్వాస తీసుకోగలుగుతున్నారని తెలిపారు.

Latest News

More Articles