ప్రతీ ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలన్నారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకోవడం, భారతదేశానికి స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులను స్మరించుకోడం మనందరి బాధ్యతన్నారు.సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ జాతీయ జెండావిష్కరణ చేశారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన..పోలీసు అధికారులు జాతి సమగ్రత, సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేసి మెరుగైన సమాజం దిశగా అడుగువేయలన్నారు. ఎందరో మహానుభావులు త్యాగఫలమే ఈ రోజు మనందరం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. మహానుభావుల త్యాగాలను నిరంతరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. పోలీసులు శాంతిభద్రతలు, దేశ సమగ్రత, ప్రజా సేవలో అంకితమవ్వాలన్నరు. ప్రజల శాంతిభద్రత,మెరుగైన సేవలు అందించడంలో సైబరాబాద్ పోలీసులు అగ్రగామిగా ఉన్నారన్నారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.