Tuesday, May 21, 2024

నిషేదిత ఈ-సిగరేట్లను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

spot_img

ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు, పబ్‎లను టార్గెట్‎గా చేసుకుని నిషేదిత సిగరేట్లను అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి రూ. 2 లక్షల విలువ చేసే ఈ- సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు గురించి మాదాపూర్ డీసీపీ సందీప్ రావు మీడియా సమావేశం పెట్టారు. ‘సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ – సిగరెట్లు విక్రయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నాం. ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న మొత్తం పది మందిని గుర్తించాం. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుండి రెండు లక్షల రూపాయల విలువ చేసే 99 డిస్పోసల్ ఈ – సిగరెట్లు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఈ-సిగరెట్లు 2019లో బ్యాన్ చెయ్యడం జరిగింది. అటువంటి ఈ-సిగరెట్లు విక్రయించినా, కొనుగోలు చేసినా చట్ట పరమైన చర్యలు తప్పవు’ అని డీసీపీ హెచ్చరించారు.

Latest News

More Articles