Sunday, May 12, 2024

వంట చేస్తుండగా సిలిండర్‎కు మంటలు.. ఆపై పేలుడు

spot_img

రంగారెడ్డి జిల్లాలో భయంకర ఘటన చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్‎లోని ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు సంభవించింది. ఇంటి యజమానురాలు అస్మతి కుమారి వంట చేస్తుండగా.. ఒక్కసారిగా సిలిండర్‎కు మంటలు అంటుకున్నాయి. దాంతో భయపడిన అస్మతి కుమారి.. ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. కాసేపటికే మంటలు ఎక్కువై.. సిలిండర్ పేలింది. ఆ పేలుడు దాటికి ఇంటి గోడలు కూలిపోయాయి. అయితే సిలిండర్ పేలుడుతో బాంబు బ్లాస్ట్ అయినట్టుగా శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles