Thursday, May 2, 2024

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

spot_img

మెదక్ జిల్లా చేగుంట హైవే బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మెస్ అండ్ కంపెనీ బస్సు యూటర్న్ చేసుకుంటున్న క్రమంలో ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. దీంతో కంపెనీ బస్సు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10మందికి పైగా కార్మికులు గాయపడ్డారు.

ప్రమాద సమయంలో బస్సులో 25 మంది కార్మికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ప్రైవేట్ బస్సులో రవి శంకర్ రెడ్డి అనే ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

Latest News

More Articles