ఉపాధ్యాయ నియామక పరీక్ష(TS TRT) దరఖాస్తు గడువు నిన్న(శనివారం) అర్ధరాత్రితో ముగిసింది. దీనికి మొత్తం 1,76,527 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువగా ఎస్జీటీ తెలుగు సబ్జెక్ట్ కోసం 60,190 అప్లికేషన్లు వచ్చాయి. స్కల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ,పీఈటీ,భాషా పండితులు, పలు సబ్జెక్టులో మొత్తం 43 విభాగాల్లో 5,089 పోస్టుల భర్తీకి విద్యాశాఖ అప్లికేషన్లు స్వీకరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిపారు విద్యాశాఖ అధికారులు.
ఇది కూడా చదవండి: ఆమెరికాలో గుండెపోటుతో మెదక్ జిల్లా విద్యార్థి మృతి