Friday, May 10, 2024

సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ క్యాంప్‌ క్లర్క్‌ విష్ణువర్ధన్‌ అనుమానాస్పద మృతి

spot_img

సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ మాధురి  దగ్గర సీసీ (క్యాంప్‌ క్లర్క్‌) గా పనిచేస్తున్న గడిల విష్ణువర్ధన్‌ (44) అనుమానాస్పద రీతిలో చనిపోయారు. కొండాపూర్‌ మండలం తెలంగాణ టౌన్‌షిప్‌ దగ్గర కాలిన గాయాలతో ఆయన మృతి చెందినట్లు ఇవాళ(ఆదివారం) ఉదయం పోలీసులు గుర్తించారు.

నిన్న(శనివారం) మధ్యాహ్నం నుంచి విష్ణువర్ధన్‌ ఇంటికి వెళ్లలేదు. ఆయనకు భార్య శివ కృష్ణ కుమారి, కుమార్తె వైష్ణవి (18), కుమారుడు హర్షవర్ధన్‌ (16) ఉన్నారు. రాత్రి భార్య ఫోన్‌ చేస్తే విష్ణు మాట్లాడినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో గత నెలరోజులుగా ఆయన సెలవుపై ఉన్నట్లు కలెక్టరేట్‌ వర్గాలు తెలిపాయి. విష్ణువర్ధన్‌ మృతిపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ను కర్ణాటక క్షమించదు.. తెలంగాణ నమ్మదు

Latest News

More Articles