Sunday, May 12, 2024

కస్టమర్లకు ముద్దులు పెట్టాల్సిందే: మహిళా ఉద్యోగికి యజమాని ఆదేశం!!

spot_img

హైదారాబాద్ లోని ఓ మసాజ్ సెంటరుకు వచ్చే కస్టమర్లకు ముద్దులు పెట్టాలి..వారు కోరినట్టుగా నడుచుకోవాలంటూ మహిళా ఉద్యోగినికి మసాజ్ సెంటర్ నిర్వాహకులు ఒత్తిడి తెచ్చారు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో వేధింపులకు గురిచేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.

హైదరాబాద్ బండ్లగూడకు చెందిన ఓ మహిళ పంజాగుట్టలోని ఒక మసాజ్ సెంటరులో నెలకు లక్ష రూపాయల వేతనంతో ఫిట్నెస్ ట్రైనర్ గా చేరింది. కస్టమర్లకు మసాజ్, శ్వాసకు సంబంధించిన వ్యాయాయం చేయించే బాధ్యతలు నిర్వాహకులు ఆమెకు అప్పగించారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత తమ  దగ్గరకు వచ్చే మేల్ కస్టమర్లు చెప్పినట్టు చేయాలని.. అలా చేస్తేనే ఉద్యోగం ఉంటుందని నిర్వాహకులు ఆమెపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. వారికి ముద్దులివ్వాలని, వారు చెప్పినట్టు చేయాలని ఒత్తిడి చేయడంతోపాటు బెదిరింపులకు గురిచేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం..!

Latest News

More Articles