గతంలో ఎవరు చేయని అభివృద్ధిని ఈ నాలుగున్నరేండ్లలో చేసి చుపించానని చెప్పారు ఎమ్మెల్యే హరి ప్రియా నాయక్. ఇవాళ(ఆదివారం) ఇల్లందు మండలంలోని మామిడిగుడెం, పోలారం, మానిక్యారం గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరి ప్రియా నాయక్.. కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే మరింత అభివృద్ధి కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే తప్పుడు మాటలు విని మోసపోవద్దన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: సంగారెడ్డి అదనపు కలెక్టర్ క్యాంప్ క్లర్క్ విష్ణువర్ధన్ అనుమానాస్పద మృతి