Sunday, April 28, 2024

రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన మామడ ఎస్సై రాజు

spot_img

నిర్మల్ జిల్లా మామడ మండలంలోని మామడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లంచం తీసుకుంటుండగా ఎసిబికి పట్టుబడ్డాడు. ఆనంతపెట్ గ్రామానికి చెందిన సల్కం సతీష్ అ ఇటీవలే ఇంకొక వ్యక్తి తో గోడవ ప‌డ‌టంలో మామడ ఎస్సై రాజు అత‌డిపై 323, 341, 291 సెక్షన్లన‌తో కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో రిమాండ్ చేస్తానంటూ చెప్పడంతో, ప‌ది వేల రూపాయిలు ఇస్తే స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్ఐ బేరం కుదుర్చుకున్నారు. ఈ విష‌యాన్ని ఎసిబికి స‌మాచారం ఇవ్వ‌డంతో ..స‌తీష్ ఎస్ఐ రాజుకి 10 వేలు ఇస్తుండ‌గా ప‌ట్టుకున్నారు. కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.

ఇది కూడా చదవండి:  కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి

Latest News

More Articles