Saturday, May 18, 2024

శిఖర్ ధావన్ దంపతులకు విడాకులు మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు

spot_img

ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ దంపతులకు ఢిల్లీ కోర్టు నిన్న(బుధవారం) విడాకులు మంజూరు చేసింది. డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుని, నిత్యం మానసికంగా వేధిస్తోందంటూ ధావన్ తన భార్యపై చేసిన ఆరోపణలు నిజమేనని కోర్టు విశ్వసించింది. దీంతో మూడేళ్లుగా విడిగా ఉంటున్న ఈ దంపతులకు గ్రౌండ్ ఆఫ్ క్రూయెల్టీ  కింద విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. భార్య మానసిక పరిస్థితి నేపథ్యంలో కొడుకు కస్టడీని తనకే అప్పగించాలంటూ ధావన్ చేసిన విజ్ఞప్తి పై స్పందిస్తూ.. ఆ బాలుడు ఆస్ట్రేలియా పౌరుడు కావడంతో కస్టడీ కోసం అక్కడి కోర్టులను ఆశ్రయించాలని సూచించింది. అయితే, కొడుకును కలుసుకునేందుకు ధావన్ ను అభ్యంతరం పెట్టవద్దని, స్కూలు సెలవు రోజుల్లో సగం రోజులు తండ్రితో గడిపేందుకు బాలుడికి అవకాశం కల్పించాలని ధావన్ భార్యను ఆదేశించింది.

ఆయేషా ముఖర్జీ తనను డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని, వివాహం జరిగిన తర్వాత ఆస్తులను తన పేరు మీదికి మార్చాలని వేధించడం మొదలు పెట్టిందని శిఖర్ ధావన్ 2020లో కోర్టును ఆశ్రయించాడు. మిగతా రెండు ఆస్తులను కూడా తన పేరు మీదికి మళ్లించాలని గొడవ పడేదని చెప్పాడు. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారణ జరిపిన ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు బుధవారం ధావన్ కు విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

ఇది కూడా చదవండి: సినిమాల కోసం కలెక్టర్ కొలువుకు రాజీనామా

Latest News

More Articles