డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో భాగంగా ఇవాళ(సోమవారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ పై ఢిల్లీ విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్ ను 119 పరుగులకే పరిమితం చేసింది. దీంతో 120 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 9 వికెట్లతో విజయం సాధించింది.
ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు ఇద్దరు చెలరేగి ఆడారు.. మెగ్ లానింగ్ (51) , షఫాలీ వర్మ (64 నాటౌట్) చరో హాఫ్ సెంచరీ చేశారు. ఇక మెగ్ లానింగ్ అవుట్ అవ్వడంతో క్రీజ్లోకి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ (నాటౌట్) 4 గా నిలిచింది.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన గుజరాజత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో శ్వేతా సెహ్రావత్ (45) పరుగులు చేయగా మిగిలిన వారు కనీసం 20 పరుగులు కూడా చేయలేదు. ఢిల్లీ బౌలర్లలో మరజన్నె కాప్ (3/5) పేస్తో నిప్పులు చెరగగా.. స్పిన్నర్ రాధా యాదవ్ కూడా మూడు (4/20) తో యూపీ వారియర్స్ ను కట్టడి చేసింది.
ఇది కూడా చదవండి: నాలుగో టెస్టులో టీమిండియా విజయం.. 3-1తో సిరీస్ కైవసం