ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా 11 మంది అమాయక ప్రజలు మృతిచెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నిర్వహించిన నెల్లూరు, గుంటూరు సభలలో వరుస ప్రమాదాలు జరిగి 11 మంది చనిపోయారు. ఈ ఘటనలపై పలువురు రాజకీయ విశ్లేషకులు, నాయకులు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి ఓ వీడియో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
వర్మ మాట్లాడుతూ.. ‘ప్రజల ప్రాణాలు చంద్రబాబుకు గడ్డితో సమానం. పర్సనల్ ఇగో, పర్సనల్ గెయిన్ తప్ప ప్రజలంటే లెక్కలేదు. ఎంత మంది చనిపోతే అంత పాపులారిటీగా చంద్రబాబు ఫీల్ అవుతారు. చంద్రబాబు.. నీకు పబ్లిసిటీ పిచ్చి తప్ప.. ప్రజల ప్రాణాలు లెక్కలేదా?. హిట్లర్, ముస్సోలినీ తర్వాత నిన్నే చూస్తున్నాను. ప్రజలను కుక్కలుగా భావించి కానుకలు ఇచ్చారు. ఫొటో పిచ్చి కోసమే చంద్రబాబు కానుకలు ఇస్తున్నారు. అసలు నీ గురించి ఏం మాట్లాడాలో, నిన్ను ఏమనాలో కూడా తెలియడం లేదు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
My comment on the MURDERS commited by @ncbn at kandhukoor and Guntur https://t.co/QMM48v37Sz
— Ram Gopal Varma (@RGVzoomin) January 4, 2023