Sunday, April 28, 2024

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆరుగురు మృతి

spot_img

కర్ణాటకలో విషాదం నెలకొంది. బెలగావి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న మహీంద్ర బొలేరో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. జిల్లాలోని చుంచునూరు సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బొలేరో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడ మృతి చెందారు. ప్రమాదం దాటికి వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. బాధితులంతా హులకుంట గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. సమీపంలోని ఎల్లమ్మ టెంపుల్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles