Sunday, April 28, 2024

కోతులతో సెల్ఫీ. లోయలో పడి వ్యక్తి మృతి.

spot_img

కోతులతో సెల్ఫీ కోసం ప్రయత్నించి లోయలోపడి మృతి చెందాడు ఓ యువకుడు. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జరిగింది. అబ్దుల్ షేక్ అనే వ్యక్తి తన కారులో బోర్ నుంచి కొంకణ్ వెళ్తున్నాడు. మధ్యలో వరందా ఘాట్ రోడ్ లో ఉన్న వాఘ్ జాయ్ గుడి వద్ద కోతుల గుంపు కనిపించటంతో ఆగాడు. వాటితో పాటు సెల్ఫీ తీసుకోవటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కొండపై నుంచి జారి పడ్డాడు. 500 మీటర్ల లోతులో పడిపోయి చనిపోయాడు. సమాచారం తెలియటంతో అతని కోసం పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News

More Articles