Saturday, May 11, 2024

అదుపులోనే కరోనా. కొత్తగా 188 కేసులే

spot_img

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు చాలా స్వల్పంగా నమోదవుతున్నాయి. చైనాలో కరోనా ప్రభావం భయపెడుతున్నప్పటికీ ఆ ఎఫెక్ట్ మనకు తక్కువగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,93,051 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… 188 కేసులు మాత్రమే…కొత్తగా నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో 4,46,79,319 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం 2,554 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా తో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.12 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Latest News

More Articles