Monday, May 20, 2024

ఇయర్ ఎండ్ సేల్.. కొత్త కార్ల మీద 2 లక్షల దాకా డిస్కౌంట్‌

spot_img

కొత్త కార్లు కొనేవాళ్లకు ఆటోమొబైల్‌ సంస్థలు భారీ రాయితీలు ప్రకటించాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి డిస్కౌంట్లను తెరపైకి తీసుకొచ్చాయి. దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్‌, మహీంద్రా, ఫోక్స్‌వ్యాగన్‌తోపాటు ఇతర సంస్థలు భారీగా రాయితీలు ప్రకటించాయి. కొన్ని కార్ల మీద వేల నుంచి మొదలుకొని రూ. 2 లక్షల దాకా డిస్కౌంట్ ఇస్తున్నాయి.

Read also: కాలువలో పడిన కారు.. నలుగురు విద్యార్థులు జల సమాధి

మారుతి సుజకీ
ఐదు డోర్లు కలిగిన జిమ్నీపై రూ.2.21 లక్షల వరకు రాయితీ ఇస్తున్నది.
ఫ్రాంక్స్‌ ఎస్‌యూవీపై రూ.25 వేల వరకు డిస్కౌంట్‌. వీటిలో రూ.15 వేలు నగదు రాయితీ ఇస్తున్న సంస్థ..మరో రూ.10 వేలు ఎక్సేంజ్‌ బోనస్‌
హ్యాచ్‌బ్యాక్‌ బాలెనోపై రూ.30 వేలు నగదు డిస్కౌంట్‌తోపాటు 10 వేలు ఎక్సేంజ్‌ బోనస్‌
గ్రాండ్‌ విటారాపై రూ.15 వేలు నగదు రాయితీ, ఇగ్నిస్‌పై రూ.40 వేల నగదు రాయితీ, అదనంగా ఎక్సేంజ్‌ బోనస్‌ కింద మరో రూ.15 వేలు

హ్యుందాయ్‌
గ్రాండ్‌ ఐ10 నియోపై రూ.45 వేల వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నది. వీటిలో రూ.35 వేల వరకు నగదు రాయితీ, ఎక్సేంజ్‌ బోనస్‌ కింద రూ.10 వేలు
ప్రజాదరణ పొందిన ఐ20, ఐ20 ఎన్‌-లైన్‌ హ్యాచ్‌బ్యాక్‌పై రూ.50 వేల వరకు
ఐ20 ఎన్‌-లైన్‌పై రూ.50 వేల వరకు నగదు డిస్కౌంట్‌, టస్కన్‌ ఎస్‌యూవీపై రూ.1.5 లక్షల వరకు నగదు డిస్కౌంట్‌

మహీంద్రా
మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్‌ మాడల్‌పై భారీ డిస్కౌంట్‌ 4.2 లక్షల వరకు కల్పిస్తున్నది.
ఎక్స్‌యూవీ 300 టాప్‌-ఎండ్‌ మాడల్‌పై రూ.1.78 లక్షల వరక రాయితీ

ఫోక్స్‌వ్యాగన్‌
ప్రీమియం టైగూన్‌పై నగదు డిస్కౌంట్‌, ఎక్సేంజ్‌ బోనస్‌, సర్వీస్‌ ప్యాకేజింగ్‌ కింద రూ.4.2 లక్షల వరకు కల్పిస్తున్నది.
వర్చస్‌ సెడాన్‌పై రూ.50 వేల నగదు రాయితీ కలుపుకొని ఎక్సేంజ్‌ బోనస్‌ కింద రూ.20 వేలు, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ కింద రూ.17 వేలు కలుపుకొని మొత్తంగా రూ.1.17 లక్షలు రాయితీ ఇస్తున్నది.

హోండా
మరో కార్ల సంస్థ హోండా కూడా పలు మాడళ్లపై రాయితీని ప్రకటించింది. అమేజ్‌పై రూ.77 వేల రాయితీని ప్రకటించిన సంస్థ..సిటీపై లక్ష రూపాయల వరకు ప్రత్యేక రాయితీని ఇస్తున్నది.

ఎంజీ మోటర్‌
ఎంజీ అస్టార్‌పై రూ.1 లక్ష వరకు ప్రయోజనాలు, ఎక్సేంజ్‌ కింద రూ.50 వేలు
ప్రీమియం ఎస్‌యూవీ గ్లోస్టర్‌పై లక్ష రూపాయల వరకు ప్రయోజనాలు

Latest News

More Articles