Thursday, May 9, 2024

కాలువలో పడిన కారు.. నలుగురు విద్యార్థులు జల సమాధి

spot_img

అదుపుతప్పిన కారు చెరువులో పడటంతో నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. హైదరాబాద్‌ – బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ స్విఫ్ట్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు దుర్మరణం చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న చిక్‌బళ్లాపూర్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకోని కారును బయటకు తీశారు. మృతులను రేవా కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.

Read Also: సఫారీలతో సై అంటున్న భారత సేన.. నేటి నుంచి టీ20 సిరీస్

Latest News

More Articles