Saturday, May 18, 2024

ర్యాగింగ్ కు పాల్పడిన గాంధీ మెడికల్ కాలేజీ సీనియర్లు ఏడాది పాటు సస్పెండ్

spot_img

సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో జూనియర్ల మెడికోలను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన డీఎమ్ఈ రమేష్ రెడ్డి..ర్యాగింగ్ కు పాల్పడిన 10 మందిని ఏడాది పాటు కాలేజీ హాస్టల్ నుంచి సస్సెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ర్యాగింగ్ కు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎక్కడైనా ర్యాగింగ్ జరిగితే సహించేది లేదన్నారు డీఎమ్ఈ రమేష్ రెడ్డి.

Latest News

More Articles