ఈ మధ్యకాలంలో ఎవరికి ఎప్పుడు గుండెపోటు వస్తుందో తెలియడంలేదు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు భారిన పడుతున్నారు. తాజాగా ఓ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగింది. బడంగ్పేట్కు చెందిన జె.ధనుంజయ్(41) ఓ ప్రైవేటు ట్రావెల్స్లో డ్రైవర్. ఆయనకు భార్య నందిని, కూతురు ఝాన్సీ(10), కొడుకు సుదాన్ష్(8) ఉన్నారు.
ఉదయమే ట్రావెల్స్కు వచ్చిన ధనుంజయ్.. కారు తీసుకొని పాతబస్తీ లాల్దర్వాజా ప్రాంతంలో ఓ ప్రయాణికుడిని పికప్ చేసుకునేందుకు బయలుదేరాడు. నల్లవాగు సమీపంలోని ధోబీఘాట్ వద్ద కందికల్ ఆర్వోబీ ఎక్కే ముందే ధనుంజయ్కు గుండెపోటు వచ్చింది. తక్కువ వేగంతో ఉన్న కారును అదుపు చేసినా.. అది పక్కనే ఉన్న డివైడర్పైకి ఎక్కి ఆగిపోయింది. ఈ గ్యాప్లోనే ధనుంజయ్ సీటులోనే తుదిశ్వాస విడిచాడు. వాహనదారులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Read Also: హరీశ్ అన్నా రైతుబంధు రాలె.. పెట్టుబడికి ఇబ్బంది ఐతుంది