Sunday, May 12, 2024

ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు డీఎస్సీ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు

spot_img

డీఎస్సీ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల గ‌డువును పొడిగిస్తున్న‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. డీఎస్సీకి ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల విజ్ఞ‌ప్తులతో డీఎస్సీ ద‌ర‌ఖాస్తుల గ‌డువును పొడిగిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో తెలిపింది.

నోటిఫికేష‌న్‌లో ఇచ్చిన ప్ర‌కారం  రేపటి(శనివారం,-21)తో గ‌డువు ముగుస్తుంది. శనివారం వ‌ర‌కు డ‌బ్బులు చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించ‌గా, 21తో ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు అవ‌కాశం ఇచ్చారు. కానీ ఈ గ‌డువును 28 వ‌ర‌కు పొడిగించారు. రాష్ట్రంలో 5089 టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి కొద్ది రోజుల క్రితం నోటిఫికేష‌న్ విడుదల చేసింది ప్రభుత్వం.

ఇది కూడా చదవండి: రేవంత్‌ రెడ్డి తీరు హంతకుడే సంతాపం తెలిపినట్లుంది

Latest News

More Articles