ముంబై: ముంబై ఇండియన్స్ కొత్త బౌలింగ్ కోచ్ను నియమించుకుంది. వచ్చే సీజన్ నుంచి ఆజట్టుకు శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ సేవలు అందించనున్నాడు. ఇప్పటివరకు ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా ఉన్న షేన్ బాండ్ ఇటీవలే ముంబైని వదిలాడు.
Also Read.. ఈ నెల 28వ తేదీ వరకు డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు
ఐపీఎల్లో 2009 నుంచి 2019 వరకూ ముంబై ఇండియన్స్కు మలింగ ఆడారు. 2021, 2022 సీజన్లలో రాజస్తాన్ రాయల్స్ కు బౌలింగ్ కోచ్గా మలింగ సేవలు అందించాడు. తాజాగా రాజస్తాన్ నుంచి తప్పుకుని ముంబై జట్టుకు తిరిగొచ్చాడు మలింగ.
Also Read.. పాలమూరు అభివృద్ధి కోసం బీఆర్ఎస్ లో చేరుతున్నా
ముంబైకి తిరిగిరావడంపై మలింగ స్పందించాడు. ముంబై ఇండియన్స్ టీమ్ కు బౌలింగ్ కోచ్గా వచ్చినందుకు తనకు గర్వకారణం అన్నారు. తాను మార్క్ బౌచర్ (ముంబై హెడ్కోచ్), పొలీ (కీరన్ పొలార్డ్), రోహిత్ లతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొన్నారు.