బాలీవుడ్ నటి పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ట్విటర్ లో పెట్టిసన పోస్టు వైరల్ గా మారింది. మేము విడిపోయాం..ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు మాకు కొంత సమయం ఇవ్వండి అంటూ ట్వీట్ చేశాడు. దీనికి గుండె ముక్కలైన ఎమోజీతోపాటు చేతులు జోడిస్తున్న సింబల్ ను యాడ్ చేశాడు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో రాజ్ కుంద్రా ఈ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ గా మలింగ
ఇక ఈ పోస్టు చూసిన నెటిజన్లు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా విడాకులు తీసుకుంటున్నారా అంటూ షాక్ అయ్యారు. మొన్నటివరకు బాగానే ఉన్న వీరు సడెన్ ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే ఫన్నీగా కామెంట్స్ చేస్తూ విడిపోతున్నది ఆయన భార్యతో కాదు మాస్క్ తో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 2021లో నీలిచిత్రాల కేసులో కుంద్రా అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కొంతకాలం పాటు జైల్లో కూడా ఉన్నాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీడియాకు తన ముఖం చూపించడం లేదు. ఎప్పుడు బయటకు వచ్చిన ముఖానికి మాస్క్ తో కనిపిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: ఈ నెల 28వ తేదీ వరకు డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు
కాగా ఈమధ్యే తన జీవితం గురించి బయోపిక్ కూడా తీస్తున్నట్లు ప్రకటించాడు. యూటీ 69 అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కుంద్రానే ప్రధాన పాత్రలో యాక్ట్ చేశాడు. చాలా కాలం పాటు మాస్క్ తో కనిపించిన కుంద్రా ఈ సినిమా లాంచ్ ఈవెంట్ లో మాస్క్ తీసేసి మీడియా ముందు కనిపించారు. అయితే మాస్క్ తో ఇక అవసరంలేదనే ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔
— Raj Kundra (@onlyrajkundra) October 19, 2023