Saturday, May 11, 2024

సీఎం కేసీఆర్.. హైదరాబాద్ ను న్యూయార్క్ లా…కరీంనగర్ ను లండన్ లా తయారు చేశారు

spot_img

సీఎం కేసీఆర్.. హైదరాబాద్ ను న్యూయార్క్ లా…కరీంనగర్ ను లండన్ లా తయారు చేశారని తెలిపారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గంలో ఎమ్మేల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత 300 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు.తెలంగాణ లో జరిగిన అభివృద్ధి ప్రజలందరి కళ్ళ ముందు ఉందన్నారు. భారత దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం  ప్రవేశ పెట్టి.. హుజూరాబాద్  నియోజక వర్గంలో వందకు వంద శాతం పూర్తి చేయడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.

కేసీఆర్ కు దళితుల మీద ఉన్న ప్రేమ భారత దేశం లో ఏ నాయకునికి లేదని చెప్పారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. దళిత బంధు పథకం ద్వారా లబ్ది పొందిన ఒక్కో కుటుంబం నెలకు ముప్పై వేలు సంపాదిస్తున్నారు.రైతులు బాగుండాలని 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు రైతు బంధు,పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు రూ.2వందలు ఉన్న అసరా పెన్షన్ రూ.2000 చేసిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ వంద సీట్లు గెలిచి కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కాక తప్పదని.. అందులో మొదట గెలిచే సీట్ హుజూరాబాద్ ది అని స్పష్టం చేశారు. హుజూరాబాద్ లో బీ అర్ ఎస్ ఎవరు ఊహించని మెజారిటీ వచ్చి తీరుతుందన్నారు.

బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల దిమ్మ దిరిగిపోయిందన్నారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళ కు మూడు వేల రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప విషయమన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ను నియోజక వర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు.గత ఎమ్మెల్యేకు 20 ఏండ్లు అవకాశం ఇచ్చారు.. నాకు ఒక్క సారి అవకాశం ఇచ్చి చూడండి…సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కైన వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసి మరో సిద్దిపేటలా మారుస్తానన్నారు ఎమ్మెల్సీ.

ఇది కూడా చదవండి: ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు డీఎస్సీ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు

Latest News

More Articles