Sunday, May 12, 2024

తిరుమల శ్రీవారి నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి

spot_img

తిరుమల శ్రీవారి నడకదారిలో ఏపీ ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌  గుండెపోటుతో మృతిచెందారు. ప్రధాని మోడీ ఈ నెల 26, 27 తేదీల్లో తిరుమలలో  పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా విధుల్లో భాగంగా డీఎస్పీ కృపాకర్‌ తిరుమలకు వచ్చారు. ఇవాళ(శనివారం) ఉదయం మెట్ల మార్గాన్ని పరిశీలిస్తుండగా.. 1805 మెట్టు దగ్గర ఆయనకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. తోటి సిబ్బంది దవాఖానకు తరలించేలోపే ఆయన మరణించారు. డీఎస్పీ కృపాకర్‌ స్వస్థలం వియవాడ సమీపంలోని పోరంకి. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

ఇది కూడాా చదవండి: అభ్య‌ర్ధుల గుణ‌గ‌ణాలు చూసి ఓటు వేయండి

Latest News

More Articles